27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నగరంలో కత్తిపోట్ల కలకలం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో కత్తిపాట్లు జరిగాయి. బుధవారం సాయంత్రం నగరంలోని బోధన్ రోడ్లు గల నిజాం సాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలో షేక్ గౌస్ అనే వ్యక్తిపై ముగ్గురు యువకులు కత్తులతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో యువకుడి పై కత్తితో దాడి చేయగా మూడు చోట్ల కత్తిపోట్లు దిగాయి. ఈ ఘటనలో షేక్ గౌస్ పేగులు బయటకు వచ్చాయి. హుటాహుటిన గౌస్ ను నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కూలి పని చేసే చోట యువకులకు మధ్య విభేదాలు ఉండగా అవి కక్షలకు దారితీసాయి. ఈ మేరకు ఆరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రంజాన్ పండగ నాటి నుంచి నిజామాబాద్ నగరంలో ప్రతిరోజు కత్తుల స్వైర విహారం కొనసాగుతోంది. ఇప్పటికీ రెండు పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసులు నమోదయ్యాయి.

More articles

Latest article