24 C
Hyderabad
Sunday, August 2, 2026

నల్ల రిబ్బన్ ధరించి ముస్లీంల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రంజాన్ పండుగ వేళ వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా సోమవారం ముస్లింలు తమ చేతికి నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో ఉర్దూ అకాడమీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు తాహెర్ బిన్ హందాన్ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.  అన్ని మండలాలలో నల్ల రిబ్బన్ లు ధరించి నిరసన తెలుపుతూ నమాజ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ  బిల్లు 2024  పార్లమెంటులో ప్రవేశపెడుతున్ననేపథ్యంలో బిల్లుకు అడ్డుకోవాలని అన్నారు. అది ఆమోదం పొందితే ముస్లీం సమాజానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు  ఈ బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article