బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎస్డీఎఫ్ అదనపు నిధుల ద్వారా సీసీ బెడ్ పనులను స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో నిధులను సమకూర్చారని తెలిపారు. కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్, మోర్తాడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల అశోక్ మోర్తాడ్ మండల అధ్యక్షులు ముత్యాల రాములు, డి,సి,సి,బి డైరెక్టర్ మోత్కు భూమన్న ,జిల్లా సెక్రటరీ గిర్మాజి గోపి, మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్ ,మాజీ ఉపసర్పంచ్ చొక్కాయి గంగా రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మైపాల్, మోర్తాడ్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మాలావత్ సుదీర్ నాయక్, మైనార్టీ జిల్లా సెల్ నజీర్ ,మోర్తాడ్ పట్టణ ఉపాధ్యక్షులు కోమీరే శ్రీధర్, కడపటి రాజేశ్వర్ గోనుగొప్పుల రమేష్, జక్కం పృధ్వీరాజ్, సాగర్, భోగ రమేష్ ,సుధాం గురువయ్య ,ముసుకు రమేష్, జక్కం అశోక్, జైడి పెద్ద గంగారం, చిన్న గంగారం కుదురుపాక ప్రవీణ్, కురుమ నరేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
