రుద్రూర్, బతుకమ్మ: విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో గల హనుమాన్ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ధర్మ ధ్వజం కాషాయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి తేజ, హిందూ సంఘాల నాయకులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

