29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళ దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని కంటేశ్వర్  బైపాస్ రోడ్డులో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. కమల (50) అనే మహిళను హత్య చేసి కాలువలో పారేసేందుకు వెళ్లగా పోలీసులకు దొరికారు. కమల అనే మహిళను హత్య చేసి డెడ్ బాడీని మాక్లూర్ మండలం దాస్ నగర్ శివారులోని నిజాంసాగర్ కేనాల్లో పడేసేందుకు రాగా పోలీసులు గుర్తించారు. డీమార్ట్ వెనక మహిళను హత్య చేసిన తర్వాత శవాన్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి వేరే దగ్గర పడేస్తామని చూశారు. ముబారక్ నగర్ దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసి కారు ఆపకుండా వేగంగా వెళ్లడంతో వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. దగ్గరలోని కాలువలో పడేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి పట్టుకున్నారు. హత్య గల కారణాలు తెలియలేదు పోలీసులు విచారిస్తున్నారు.

A brutal murder of a woman

More articles

Latest article