బతుకమ్మ,మోర్తాడ్: నీటిని వృధా చేయకండి ఇది మన ప్రాణాధారం అని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గురువారం చలివేంద్రం ను ఆమె ప్రారంభించారు. కరుణ ట్రస్ట్ ద్వారా సమాజం లో చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె కోరారు. గ్రామంలోని నీటి ట్యాంకుల వద్ద ఉన్న కుళాయిల ద్వారా నీరు వృధా కాకుండా అరికట్టే విధంగా గ్రామంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కరుణ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబర్ పృథ్వీరాజ్, పంచాయతీ సిబ్బంది రాజకుమార్, దేవన్న, భూమన్న, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
