నిజామాబాద్, బతుకమ్మ : కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన పలువురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి జరిమానా, జైలు శిక్ష విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందికి ట్రాఫిక్ ఏసీపీ టి.నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట వారిని హజరుపర్చారు. న్యాయమూర్తి నూర్ జాన్ 10 మందికి రూ. 14,000 జరిమానా, మరో ఏడుగురు వ్యక్తులకు జైలు శిక్ష విధించారు.
