బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గల శివాలయంలో నూతన ధర్మశాల భవనం కి బుధవారం భూమి పూజ చేయడం జరిగింది. భవనం కొరకై రూ.13లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ కు శెట్పల్లి గ్రామ ప్రజల తరఫున, శెట్పల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్యాల రాములు, ఇంచార్జ్ గడ్డం అనిల్, గ్రామ శాఖ అధ్యక్షులు లక్మరంజిత్, మండల ఉపాధ్యక్షులు బద్దం దేవేందర్, బబ్బురినవీన్,మెంచుశ్రీనివాస్, లక్మ గంగాధర్, పుప్పాల లింగారెడ్డి, పుప్పాల నర్సయ్య, మెంచు నవీన్, రాడె లింబన్న, సత్యం, చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.