హైదరాబాద్, బతుకమ్మ : మల్టీ జోన్ – 1లో 14 మంది సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లో పని చేస్తున్న జి.నరేష్ ను భూపాలపల్లి జిల్లా డిఎస్బీగా, కే.నాగేశ్వర్ రావును రాజన్న సిరిసిల్లా జిల్లా డీసీఆర్బీగా, ఆర్.బన్సీలాల్ ను రామగుండం కమిషనరేట్ కు, వి.రవికుమార్ ను నిజామాబాద్ కమిషనరేట్ సీసీఎస్ గా, జె.శ్యాం సుందర్ ను సిద్దిపేట్ కమిషనరేట్ లో కమ్యూనికేషన్ కు, పైండ్ల మల్లయ్యను హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు, ఎం.రవి కుమార్ ను హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు, బానోత్ సమ్మయ్యను నిర్మల్ డీసీఆర్భీకి, బి.డి.ప్రేమ్ కుమార్ ను నిర్మల్ డీసీఆర్భీకి, మున్నూరు క్రిష్ణ ను నిర్మల్ రూరల్ సర్కిల్ కు, జి.వెంకటయ్యను నిజామాబాద్ కమిషనరేట్ ఎన్ఐబీకి, పి.దేవేందర్ రావును చెన్నూర్ పీఎస్ ఎస్హెచ్ఓగా, కట్ల రవీందర్ ను మల్టీ జోన్ 1 ఐజీపీ కార్యాలయానికి, సీహెచ్.ఎల్లయ్యను ఖమ్మం కమిషనరేట్ లోని సీఎస్బీకి బదిలీ చేశారు.
