వెబ్ న్యూస్, బతుకమ్మ : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం,భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్ ను సూర్య వివాహం చేసుకున్నారు. ఈవేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సూర్య వివాహానికి కేంద్ర మంత్రులు రామ్ మేఘవాల్, సోమన్న, బీజేపీ నేతలు అమిత్ మాలవీయ, అన్నామలై తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా, సూర్య బెంగళూరు దక్షిణ లోకసభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్నారు.

