నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జడ్పీ సీఈఓ, ఎన్నికల అధికారి సాయగౌడ్ ఆధ్వర్యంలో ఎంపీడీఓల సంఘం జిల్లా ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుని గా గంగుల సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా బి. శ్రీనివాస రావు, కోశాధికారిగా రామ్ నారాయణను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు 1 గా నీలవతి, ఉపాధ్యక్షులు 2 గా బి.రాములు నాయక్, జాయింట్ సెక్రటరీ గా జి.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఏ.నాగ్ నాథ్, పబ్లిసిటీ సెక్రటరీ గా సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ లుగా ఏ. బాల కిషన్, ఎన్.శంకర్, తిరుమల, రాజా శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
