వెబ్ న్యూస్, బతుకమ్మ : శివభక్తులతో యూపీలోని వారణాసి నిండిపోయింది. విదేశీ భక్తులు వారణాసికి విచ్చేసి బుధవారం శివరాత్రి పర్వదినాన్ని జరుపుకున్నారు. కాశీకి వచ్చిన విదేశీ భక్తులు.. అత్యంత భక్తితో శివ తాండవ స్తోత్రాన్ని పాడారు. హర హర మహాదేవ అంటూ నినాదాలు చేశారు. కాశీ విశ్వనాథుడిని భక్తులు అధిక సంఖ్య లో దర్శించుకుంటున్నారు.
