వెబ్ న్యూస్, బతుకమ్మ : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పిటిషన్ పై ఇరు వైపులా వాదనలు ముగిసినంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా, అతను ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే.
