. కళకళలాడిన పీపుల్స్ ప్లాజా
. పాల్గొన్న 3120 మంది మహిళలు
హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఆదివారం నిర్వహించిన ‘తనైరా’ శారీ రన్ ఉత్సాహంగా సాగింది. టాటా సంస్థకు చెందిన ప్రముఖ బ్రాండ్ ‘తనైరా’, బెంగళూరుకు చెందిన ఫిట్ నెస్ సంస్థ జెజె యాక్టీవ్ భాగస్వామ్యంలో నిర్వహించిన రన్ ఉత్సాహ భరితంగా కొనసాగింది. అద్భుతమైన నేత చీరలను ధరించి కార్యక్రమానికి హాజరైన 3120 మంది మహిళలతో పీపుల్స్ ప్లాజా కళకళాడింది. రన్ ను తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్, జెజె యాక్టీవ్ కోచ్ ప్రమోద్ ప్రారంభించారు.

