27.5 C
Hyderabad
Friday, July 31, 2026

గురుకులాలను సందర్శించిన ఎమ్మెల్సీ అభ్యర్థి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ శుక్రవారం మెండోరా మండలంలోని పోచంపాడ్ లో గల గురుకులలాను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో, ప్రైవేటు స్కూళ్లలో, ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ టీచర్లు ను ప్రైవేటు టీచర్ల ను కలిసి తనను పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గెస్ట్ టీచర్లకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు వారి పక్షాన నిలబడతానని తెలియజేశారు. తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రైవేటు స్కూళ్లలో కళాశాలలో, ఇతర ప్రైవేటు కంపెనీలలో అతి తక్కువ చాలీచాలని జీతంతో జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టభద్రులు  తనని గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుకనై నిలబడతానని తెలియజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉపాధ్యక్షులు సూర్ నీడ దశరథ్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బెజ్జారం అంబదాస్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం  నాయకులు రాజుల కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article