29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ఆషాడ మాసం శుక్రవారం కావడంతో నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలోభక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కలు చెల్లించుకున్నారు.తమ సంతాన సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలని అమ్మవారిని దీవించుకున్నారు. భక్తులు ముడుపులు చెల్లించుకున్నారు. ఎంతో మహిమ గల పెద్దమ్మ తల్లి ఆలయంలో మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి నిష్టతో పూజ చేస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం.

More articles

Latest article