25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్  పట్టణంలోని వేంకటేశ్వర కాలనీ ఆలయ ప్రాంతంలో బుధవారం సాయంత్రం హన్సిక అనే బాలికపై కుక్కలు దాడిచేశాయి. బాలిక ఆడుకుంటుండగా అవి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలికను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్​కు తరలించాలని వైద్యులు సూచించారు. హన్సికతో పాటు యోగేశ్వర్ కాలనీకి చెందిన మరో బాలుడిపై కూడా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మూర్లో కుక్కలు ప్రతి వార్డులలో విపరీతంగా ఉంటున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. బయటికి పిల్లలు వెళ్లడానికి భయపడుతున్నారు.

Two children were seriously injured in the dog attack

More articles

Latest article