నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ ఆరవ టౌన్ పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో భాదితులు పోగోట్టుకున్న తొమ్మిది సెల్ పోన్ లను రికవరీ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ ఓ వెంకట్రావు సంబంధిత సెల్ పోన్ లను బాధితులకు అందచేశారు. ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టెబుల్ యాస్మీన్ సిఇఐఆర్ పోర్టల్ యాప్ ద్వార 9 సెల్ పోన్ లను రికవరీ చేయడం పట్ల అధికారులు అభినందించారు
