బతుకమ్మ, వేల్పూర్ :-మండల కేంద్రంలోని టిఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి గురువారం పూలమాలవేసి వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు దాటుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగదర్ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు బబ్బురు ప్రతాప్, టిఆర్ఎస్ నాయకులు రేగుల రాములు, సత్యం, దయాకర్, మొండి అశోక్, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
