24.1 C
Hyderabad
Monday, August 3, 2026

సోయా కొనుగోలు కేంద్రం చేపట్టాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో గత కొద్ది రోజుల నుండి సోయా కొనుగోలు కేంద్రం మూతపడటంతో సుమారు ఎనిమిది వేల క్వింటాళ్ల సోయాబీన్ ధాన్యం మిగిలిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతుండగా సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు దగ్గరికి రైతులను తీసుకెళ్లి పరిస్థితి వివరించగా మంత్రి మిగిలిపోయిన సోయా పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు. సమస్యను తన గారి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి రైతులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కి నియోజకవర్గ రైతులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నాయకులు కార్యకర్తలు రైతులు ఉన్నారు.

More articles

Latest article