27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పసుపు బోర్డు ఏర్పాటులో ఎమ్మెల్సీ కవిత కృషి ఎనలేనిది

Must read

📰 Generate e-Paper Clip

నగర మేయర్ దండు నీతూ కిరణ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పసుపు బోర్డు ఏర్పాటులో ఎమ్మెల్సీ కవిత కృషి ఎవరు కాదనలేని సత్యమని  నగర  మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెల్సి కవిత పసుపు బోర్డు ఏర్పాటు స్వాగతిస్తునామని తెలిపి పసుపు పంటకు మద్దతు ధర, పసుపు దిగుమతులను కట్టడి చేసే విధంగా కృషి చేయాలని చేసి సూచనను, పసుపు బోర్డు ఏర్పాటుకు తాను చేసిన కృషిని చెప్పుకుంటే మీకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. కొద్ది మంది నాయకులు వారి స్థాయి మరచి పెద్ద నాయకులను విమర్శిస్తే పెద్దవాళ్లం అవుతామని భ్రమ పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత పసుపు బోర్డు ఏర్పాటుకు ఎన్నో సార్లు ప్రధాన మంత్రిని, 5రాష్ట్రల ముఖ్యమంత్రులను కలిసి వినతులు అందించారని పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన పసుపు బోర్డు అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నించారన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. పసుపు రైతుల సమస్యలపై చేసిన పోరాటానికి పార్లమెంట్ వేదికగా లేవనేత్తిన అంశాలకు గాను ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు సైతం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్నీ తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ కవిత పై అవాకులు చేవాకులు మాట్లాడితే తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. ఎవరో చెపితే ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు మీ ఎంపీ అరవింద్ ని పసుపు బోర్డు గొప్పదా లేక టర్మారిక్ ఎక్సటెన్షన్ సెంటర్ గొప్పదో ప్రశించాలని కోరారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత ఎనలేని కృషి చేసారని, ప్రస్తుత ఎంపీ అరవింద్ 5రోజుల్లో తెస్తానన్నా పసుపు బోర్డు కు 5సంవత్సరాల కాలయాపన తరువాత రాజకీయ లబ్ది కోసమే బోర్డు ప్రకటన చేసారని ఎందుకు బహిరంగ ప్రారంభ వేడుకలు నిర్వహించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి వైస్ ఛైర్మెన్ సుమన రెడ్డి, మాజీ కార్పొరేటర్లు విశాలిని రెడ్డి, సిర్ప సువర్ణ, పార్టీ కార్మిక విభాగం ఆధ్యక్షురాలు విజయలక్ష్మి, పార్టీ నగర మహిళా ఆధ్యక్షురాలు గంగామణి, నాయకులు పంచరెడ్డి అనిత పాల్గొన్నారు.

MLC Kavitha's efforts in setting up the Yellow Board are immeasurable

More articles

Latest article