రాజంపేట, బతుకమ్మ : రాజంపేట మండలంలోని బసవన్నపల్లి-అరగొండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, ఆరు వాహనాలు, రూ.58,350 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
