నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఏడు నెలల కింద మిస్సింగ్ అయిన మహిళా ఎముకలు శనివారం లభ్యమైన ఘటన మోపాల్ మండలంలో వెలుగు చూసింది. మండల కేంద్రానికి చెందిన జంగం విజయ ఏడు నెలల క్రితం మిస్సింగ్ అయింది. అయితే రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు స్థానికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాడు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం మంచిప్ప ప్రాంతంలోని ఒక కల్వర్టు కింద మహిళ ఎముకలను గుర్తించారు. జేసీబీ సహాయంతో మహిళ ఎముకలను బయటకు తీసారు. ఘటన స్థలాన్నిఏసీపీ రాజ వెంకట రెడ్డి, సీఐ సురేష్, ఎస్ఐ యాదగిరి గౌడ్ పరిశీలించారు.
