- బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
బతుకమ్మ, జుక్కల్ : గ్రామాల్లో రేషన్ కార్డుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో, భవాని తాండలో శుక్రవారం రేషన్ కార్డుల సర్వేను ఆమె తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
