నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టణంలోని ఖలీల్ వాడి తెలుగు మీడియం ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టారు గా పని చేసి రిటైర్డ్ అయిన హెచ్. ఎం వాసుదేవరావు ను ఘనంగా సన్మానించారు. సోమవారం స్థానిక ఖలీల్ వాడి స్కూల్ లో ఆయనను నార్త్ మండల్ ఎం.ఈ.ఓ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పూలమాల, శాలువతో సన్మానించి,ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్. ఎం మురళీధర్, లచ్చిరామ్, మల్లయ్య, కిషన్ రావు, వర్మ, పవన్ కుమార్, సులోచన, రాజేంద్రప్రసాద్, శ్రావణ్, కొటగల్లి, జెండా గల్లీ హెచ్. ఎం లు రాంచందర్ గైకవాడ్, భాస్కర్, సాయి కుమార్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
