బతుకమ్మ,మోర్తాడ్: సమ సమాజంలో మహిళలు ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదగాలని డ్వాక్రా సంఘాల ద్వారా శ్రీనిధి, మైక్రో తదితర రుణాలు ఇచ్చి సమాజంలో నిలదొక్కుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని ఐకెపి (డీఆర్ డీఏ) ఏపీఎం ల జిల్లా అధ్యక్షులు మాణిక్యం అన్నారు. బుధవారం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో పిండి గిర్ని, మ్యాచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో దాసు, భారత్ సేవ పురస్కార్ అవార్డు గ్రహీత మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
