ఎంపి అర్వింద్ ను కలిసిన తెలుగు విద్యార్ధులు
హైద్రాబాద్, బతుకమ్మ: రాబోయే డిల్లీ అసెంబ్లి ఎన్నికలలో బిజేపి తరుపున పని చేయడానికి ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటిలో చదువుతున్న తెలుగు విద్యార్ధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ను బుధవారం ఆయన నివాసం కొంత మంది తెలుగు విద్యార్ధులు కలిసారు. ప్రధాని మోడి చరీష్మతో డిల్లీ అసెంబ్లి ఎన్నికలలో బిజేపి తరుపున పని చేయడానికి తెలుగు విద్యార్ధులు ముందుకు రావడం పట్ల ఎంపి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు.

