ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో సోమవారం నేషనల్ ఫార్మర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పిల్లలకు వ్యవసాయం పైన అవగాహన చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల గురించి తెలుపుతూ మన జీవనాధారానికి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది వివరంగా తెలపడం జరిగింది. వ్యవసాయ పద్ధతులు, పనిముట్లు గురించి తెలుపుతూ వాటి విధానాన్ని తెలపడం జరిగింది .విద్యార్థిని విద్యార్థులు వ్యవసాయదారుల ఆకృతిలో చూపర్లను ఆకట్టుకునే విధంగా వేషధారణ వేసి వ్యవసాయం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాతాజీలు శైలజ ,సోనాలి ,మంజుల, సింధుజ, ప్రియాంక ,వనిత తదితరులు పాల్గొన్నారు.
