బతుకమ్మ, మెండోరా: మండలంలోని సావెల్ గ్రామానికి చెందిన ఆర్తిక్ అనే వ్యక్తి కంటి సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో వైద్యం చేయించుకోవడానికి హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. వైద్యు ఖర్చులకు కోసం బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,50,000 ఎల్ వో సి ని అందించడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
