నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి కిడ్నాప్ కు గురైంది. గౌసియా మసీదు వద్ద నుంచి సోమవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో మాలపల్లికి చెందిన మక్దూమ్ అనే వ్యక్తి తన కోడలిని కిడ్నాప్ చేశాడని యువతి మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి పెళ్లి నిశ్చయమైందని, త్వరలోనే పెళ్లి కావాల్సి ఉందని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
