-మాజీ ఎంపీపీ రమేష్ నాయక్
ఇందల్వాయి,బతుకమ్మ : లగచర్ల రైతుల అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించటం పై నిరసనగా రైతుల హక్కులను కాపాడాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్యే కేటిఆర్ పిలుపు మేరకు ఇందల్వాయి మండలంలోని బస్టాండ్ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య,రాష్ట్ర సీనియర్ నాయకులు పాశం కుమార్, రఘు, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా పాలనా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరిక పాలనా సాగిస్తుందని అమాయక గిరిజన,దళిత రైతుల భూములను అక్రమంగా లాక్కుని తమ సొంత వారికి అప్పజెప్పడానికే రైతులను ఆక్రమంగా అరెస్టు చేసి లొంగని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధింపులకు గురి చేయటకు నిరసన తెలిపే వారిపై ఆక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురించేస్తున్నారని ఇటువంటి ఆటవిక అరాచక పాలనను తెలంగాణ సమాజం సహించదన్నారు. బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ది చెప్తారని, హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చందర్,మాజీ ఎంపీటీసీ,హుస్సేన్,శ్రీనివాస్, క్రాంతి తదితర నాయకులు పాల్గొన్నారు.
