బాన్సువాడ , బతుకమ్మ : హైదరాబాద్లో నిర్వహించి మాలల సింహ గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింలు, అంబేద్కర్ సంఘం బాన్సువాడ డివిజన్ ఉపాధ్యక్షుడు మన్నె చిన్న సాయిలు అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును తాము వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షుడు దేశాయిపేట ప్రశాంత్, గైని రవి, మైసయ్య, శివయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.