మంచిప్ప రిజర్వాయర్ కు పాత డిజైన్ ప్రకారం భూములు ఇవ్వాలి
మోపాల్, బతుకమ్మ: మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం పాత డిజైన్ ప్రకారం జరుగుతుందని గతంలో ప్రభుత్వం చేపట్టిన ప్లాన్ ప్రకారం రైతులు భూములు ఇవ్వాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి ఇరిగేషన్ అధికారులతో మంచిప్ప గ్రామ రైతులతో సమావేశం జరిగింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతు…మంచిప్ప లో ప్రాజెక్టు పాత ప్లానింగ్ ప్రకారమే జరిగేలా రైతులు భూములు ఇవ్వాలని కోరారు.

