నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరానికి చెందిన పలు బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సోమవారం పరామర్శించారు. 17వ డివిజన్ కార్పొరేటర్ సవిత భర్త, మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మురళి తండ్రి ఇటీవల మృతి చెందగా బాధితుల ఇళ్లకు బిగాల వెళ్లి పరామర్శించి ఓదార్చారు. ఆయనవెంట మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, దారం సాయిలు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు సత్యప్రకాశ్, సుదాం రవిచందర్, పరమేశ్, పంచరెడ్డి సురేశ్, కస్బ సంపత్, బాల్ దాస్, కాలభైరవ శ్రీను, గాండ్ల లింగం, చింతకాయల రాజు, ప్యాట సంతోష్, విఠల్, మధుకర్ తదితరులున్నారు.

