26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, బకాయిలను విడుదల చేయాలని రుద్రూర్ మోడల్ పాఠశాల సిబ్బంది కోరారు. పాఠశాల ఆవరణలో భోజన విరామ సమయంలో ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ప్రతినెలా వేతనాలను 010 అకౌంట్ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసనలో ప్రిన్సిపాల్ సతీశ్, చెన్నప్ప, బలరాం, ఫిరోజ్, చంద్రశేఖర్, రాఘవేంద్ర, రఘు, అనిల్, సంతోష్, సాయిక్రిష్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article