ఇందల్వాయి,బతుకమ్మ : మండలంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సున్నం నర్సయ్య (50) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య సంతోష ,ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడు నర్సయ్య టోల్ ప్లాజా వద్ద టీ కొట్టు పెట్టుకొని కుటుంబాన్ని పోషించే వారిని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
