నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వసంత పంచమి పురస్కరించుకొని ఏఆర్పీ క్యాంప్ లోని శ్రీరామ్ మందిరం 13వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక అభిషేక కార్యక్రమం, సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలకు కలశ అభిషేకం, మహిళలు కుంకుమ అర్చన, మహా యజ్ఞం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ మహోత్సవంలో సహకరించిన భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ అధ్యక్షులు సారా శ్రీనివాస్ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సారా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తోట రాజశేఖర్, నాయిని బలరాం ,కార్యదర్శి పుల్కా స్వామి, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, ఆలయ వర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

