వెబ్ న్యూస్, బతుకమ్మ : రాష్ట్ర రెవెన్యూశాఖలో కొత్తగా 10,954 గ్రామపాలనా అధికారుల పోస్టుల (జీపీవో) భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఈనియామకాలు చేపట్టనున్నారు. త్వరలోనే ఈప్రక్రియ మొదలుకానుంది.