బోధన్, బతుకమ్మ: పొతంగల్ మండలం సుంకిని గ్రామ పరిధలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నరెండు ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లు (టీఎస్ 16 ఈఎక్స్ 9226, టీఎస్ 16 ఎఫ్ కే 3961) ఇసుక తరలిస్తుండగా పట్టుకుని తదుపరి చర్యల నిమిత్తం రవాణాశాఖ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన ట్రాక్టర్లు సుంకిని గ్రామానికి చెందిన షిండే రంజిత్ అనే వ్యక్తికి చెందినవిగా అధికారులు గుర్తించారు.
