27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పోగొట్టుకున్న ఫోన్ అప్పగించిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నవీపేట్ : మార్గమధ్యలో పోగొట్టుకున్న 18 వేల విలువ గల స్మార్ట్ మొబైల్ ను నవీపేట్ పోలీసులు గురువారం అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాలేశ్వర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ జులై 27 వ తేదీన నాలేశ్వర్ నుండి తుంగిని ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో 18 వేలు విలువ గల స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ని కనిపెట్టి గురువారం సాయికుమార్ కు నవీపేట్ ఎస్సై వినయ్ పోలీస్ స్టేషన్ ల్ అప్పగించారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుండి రికవరీ చేసినట్లు ఎస్సై తెలిపారు.

More articles

Latest article