హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రం నుంచి తిరుపతి వెళ్లే యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వేశుభవార్త తెలిపింది. ఈమేరకు తిరుపతికి భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శుక్ర, శనివారాలలో చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనునట్లు వెల్లడించింది. శుక్ర, శని వారాల్లో తిరుపతికి – సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి ట్రైన్ ఉంటుందని తెలిపింది. యాత్రికులు ఈరైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

