హైదరాబాద్, బతుకమ్మ : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఈనెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు 7,754 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్ బీ వంటి రద్దీ ప్రదేశాల నుంచి బస్సులు నడింపించనున్నట్లు పేర్కొన్నారు.
