బాన్సువాడ, బతుకమ్మ : బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి , పోచారం శంభురెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. బోధన్ పట్టణం ఆచన్ పల్లి వాస్తవ్యులు కామేపల్లి ప్రశాంత్, ప్రవళిక తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 1,11,111 విరాళాన్ని ఆలయ ధర్మకర్త పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు,బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

