నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్ /బ్యాక్ లాగ్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని అకడెమిక్ ఆడిట్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్ర శేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 5375 మంది విద్యార్థులకు గాను 5183 మంది విద్యార్థులు హాజరు కాగా 192 మంది గైర్హాజర్ అయ్యారన్నారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష కు 4559 మందికి గాను 4414 మంది హాజరయ్యారని, 145 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండవ సెమిస్టర్ రెగ్యులర్, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షకు 816 మందికి గాను 769 మంది హాజరయ్యారని, 47 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. జిల్లా లోని పలు పరీక్షా కేంద్రాలను అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్ పర్యవేక్షించారు.
