నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 100 డయల్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి మొహమ్మద్ నగర్ తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ కు చేందిన టెక్కిలి నాగరాజు సోమవారం రాత్రి అతిగా మద్యం తాగి 100 సేవలను దుర్వినియోగం చేశారు. ఈ సందర్భంగా కేసు నమోదుచేసి తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్త చెల్లించే విధంగా బైండోవర్ చేశామని తెలిపారు.
