30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: కాకతీయ కాల్వలో ప్రమాదవశాత్తు మారుతి(32) పడి మృతి చెందినట్లు మెండోరా ఎస్సై నారాయణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బతుకుదెరువు కోసం సంవత్సరానికి మూడు నెలలు మెండోరా గ్రామం కి వచ్చి కూలి పని చేసుకుని వెళ్తారాని పేర్కొన్నారు. అలాగే గత రెండు నెలల క్రితం మెండోరా కి వచ్చినారని తెలియజేశారు. మారుతి ఆదివారం సాయంత్రం 6:30కు మెండోరా గ్రామ శివారులో కెనాల్ వైపు కాలకుత్యాల కోసం అని వెళ్లి రాత్రి వరకు తిరిగి రాకపోయేసరికి మారుతి కోసం కాకతీయ కెనాల్ చుట్టూ వెతకగా సోమవారం మధ్యాహ్నం వెల్కటూర్ గ్రామ శివారులో గల కాకతీయ కెనాల్ లో మారుతి శవం నీటిలో తేలుతూ ఉన్నట్లు కనిపించిందని మారుతి తమ్ముడు అవినాష్ ఫిర్యాదు చేయక కేసు నమోదు చేసినామని పేర్కొన్నారు.

More articles

Latest article