నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ శివారులో గల అటవీ ప్రాంతంలో గురువారం ఒకరి మృతదేహం గుర్తించినట్లు నిజాంసాగర్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. మృతుడు వెంకటపూర్ గ్రామానికి చెందిన మల్లెల తిమ్మయ్య(48)గా గుర్తించినట్లు తెలిపారు. తన తండ్రి మరణంపై అనుమానం ఉందని మృతుని కొడుకు యేసు ప్రభు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరిలించినట్లు తెలిపారు.
