నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తమ శ్రమకు ప్రతీకగా జరుపుకునే మేడే వేడుకలకు శ్రామికులు, కార్మికులు దూరమయ్యారు. మేడే రోజున కూడా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డు సిబ్బందితో పని చేయించడమే ఇందుకు నిదర్శనం. కమిషనర్ ఆదేశించారంటూ శానిటరీ ఇన్ స్పెక్టర్ కార్మికులతో బలవంతంగా పని చేయించినా ఎవరూ పట్టించుకోలేదు. మున్సిపల్ కార్మికులకు కార్మిక దినోత్సవాన కూడా తిప్పలు తప్పలేదు.


