బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండలంలోని వేంపల్లి గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామస్థులతో కలిసి పూజ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.