రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామం నుండి మదీనా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో షాది ఖానా అభివృద్ధి పనుల కోసం సోమవారం జహిరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదినా మజీద్ కమిటీ సదర్ షాదులు, వైస్ ప్రెసిడెంట్ షాదుల్, మాజీ క్వశ్చన్ నెంబర్ దస్తగిరి, మాజీ సదర్ లతీఫ్, మాజీ ప్రెసిడెంట్ విలేజ్ హబీబ్, వార్డ్ మెంబర్స్ మాజీ సర్పంచ్ ఖాదర్, గ్రామ పెద్దలు ఉన్నారు.
